భీమారం మండలం లోని ఉప సర్పంచ్ల ముందస్తు అరెస్ట్ :హక్కుల పోరాటంపై పోలీసుల ఉక్కుపాదం.
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 08:
ఉప సర్పంచ్ల అధికారాలు, రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరకుండా, మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో వివిద గ్రామాల ఉప సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో భీమారం మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆకుల రవీందర్, ఉపాధ్యక్షుడు దుర్గం జనార్దన్, గౌరవ అధ్యక్షుడు (సలహాదారుడు) కామర నరేందర్ ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తమ న్యాయబద్ధమైన హక్కులు మరియు అధికారాల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి ముందస్తు అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.